Saturday, April 27, 2024

రెండు లక్షల 50 వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1440 new corona cases and 5 deaths in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 50 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,50,331 పాజిటివ్‌లు తేలినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర కేసుల సంఖ్య కాస్త తక్కువ ఉన్నప్పటికీ రాబోయే మరో మూడు నెలలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు సూచించారు. ఇదిలా ఉండగా ఆదివారం 42,673 టెస్టులు చేయగా 1440 పాజిటివ్‌లు తేలాయి.

వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 278 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 13, భద్రాద్రి 97,జగిత్యాల 27, జనగాం 14, భూపాలపల్లి 17, గద్వాల 9, కామారెడ్డి 29, కరీంనగర్ 68 ,ఖమ్మం 91, ఆసిఫాబాద్ 10, మహబూబ్‌నగర్ 19,మహబూబాబాద్ 16, మంచిర్యాల 31, మెదక్ 17, మేడ్చల్ మల్కాజ్‌గిరి 133, ములుగు 27, నాగర్‌కర్నూల్ 28, నల్గొండ 70, నారాయణపేట్ 4, నిర్మల్ 21, నిజామాబాద్ 25, పెద్దపల్లి 28, సిరిసిల్లా 17, రంగారెడ్డి 112, సంగారెడ్డి 31, సిద్ధిపేట్ 42, సూర్యాపేట్ 48, వికారాబాద్ 10, వనపర్తి 18, వరంగల్ రూరల్ 23, వరంగల్ అర్బన్ లో 39, యాదాద్రిలో మరో 28 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,50,331కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,29,064కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

46 లక్షలు దాటిన కోవిడ్ టెస్టులు…

రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 46 లక్షలు దాటింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 46,18,470 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అంటే ప్రతి పది లక్షల మందిలో 1,24,085 పరీక్షలను చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రతి రోజూ చేసే టెస్టుల్లో 96 శాతం ప్రభుత్వం ఆధీనంలో టెస్టులు చేస్తుండగా, 44 శాతం ప్రైమరీ, 12 శాతం సెకండరీ కాంటాక్ట్‌లకు గవర్నమెంట్ కేంద్రాల్లో శాంపిల్స్ సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.

వర్కింగ్ ఏజ్ గ్రూప్ వైరస్ క్యారియర్స్….

కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో 21 నుంచి 50 మధ్య వయస్కులు అత్యధికంగా ఉన్నారు. ఉద్యోగ, వ్యాపార, ఇతర పనుల నిమిత్తం బయట తిరిగే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే ఈ ఏజ్ గ్రూప్ వారిపై వైరస్ దాడి చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 21 నుంచి 50 మధ్య వయస్సులు ఏకంగా 63.90 శాతం మంది వైరస్ బారిన పడటం గమనార్హం. అయితే వీరి నుంచి హైరిస్క్ గ్రూప్‌కి చెందిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులకు మప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కావున బహిరంగ ప్రదేశాల్లో వెళ్లే క్రమంలో మాస్కు, భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News