- Advertisement -
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ లోని కాబూల్ ప్రాంతం తూర్పు ప్రావిన్స్ నన్గర్ హార్ లో సైనిక స్థావరాలపై శుక్రవారం మధ్యాహ్నం తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. పోలీసులు, సైనికులకు సంబంధించిన మూడు స్థావరాలపై తుపాకులు, బాంబులతో తాలిబన్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తాలిబన్ ఖైదీలను విడుదలకు సంబందించిన చర్చలు జరుపుతుండగా ఈ దాడికి పాల్పడడంతో రక్షణ శాఖ ఆలోచనలో పడింది.
- Advertisement -