Thursday, May 2, 2024

19 వేల దిగువకు కరోనా కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

18738 new covid cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు 19 వేల దిగువకు చేరాయి. క్రియాశీల కేసులు 1.3 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,72, 910 పరీక్షలు చేయగా, కొత్తగా 18,738 కేసులు వెలుగు లోకి వచ్చాయి. శనివారం 40 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా, ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 5,26,689 కు చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4.34 కోట్లు (98.50 శాతం) దాటగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,34,933(0.31శాతంగా ఉంది. శనివారం 29,58,617 టీకాలు అందించగా, ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 206.21 కోట్లు దాటింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News