Saturday, April 27, 2024

దేశంలో కొత్తగా 1,938 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1938 new covid cases reported in india

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోల్చితే కాస్త పెరిగాయి. గత 24 గంటల్లో 1,938 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 2,531 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ బారినపడి 67 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 65,16కి చేరింది. దేశంలో ప్రస్తుతం 22,427  యాక్టివ్ కేసులుండగా, 4,24,75,588 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. రోజువారీ సానుకూలత రేటు 0.29శాతం ఉంది. ఇప్పటివరకు 182.23 కోట్ల మందికి కోవిడ్ డోసులు వేసినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News