Tuesday, May 14, 2024

లుథియానా కోర్టులో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా జిల్లా కోర్టులో భారీ పేలుడు చోటుచేసుకుంది. కోర్టు కాంప్లెక్స్ లోని మూడో అంతస్తులో గురువారం బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనలో కోర్టు భవనం ధ్వంసమైంది. పెద్ద ఎత్తున శబ్ధం, పొగలు రావడంతో జనం బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడి చేరుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

2 died after bomb blast in Ludhiana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News