Friday, April 26, 2024

అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పోస్టల్‌ ఉద్యోగులు మృతి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్‌:అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.మంగళవారం అమెరాకలోని మెమ్‌ఫిస్‌లోని టెన్నెస్సీ పోస్టాఫీస్‌లో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు.ఈ ఘటనలో ఇద్దరు పోస్టల్‌ సర్వీస్‌ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకునేలోపే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడని, నిందితుడు కూడా పోస్టల్‌ ఉద్యోగే అని పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, అమెరికాలో తరచూ కాల్పులు జరుగుతుండడంతో ఆందోళనకు గురిచేస్తోంది.

2 Postal Employees Shot dead in US

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News