Tuesday, April 30, 2024

కుల్గాంలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

2 Terrorists Killed by Army Forces in Kulgam District

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం ఉదయం కుల్గాం జిల్లాలో భద్రతా బలగాల మధ్య కాల్పులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సమయంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు.దీంతో అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపారు.  ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చరయలు కొనసాగుతున్నాయని తెలిపారు.

2 Terrorists Killed by Army Forces in Kulgam District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News