Thursday, May 2, 2024

ఎపిలో 2,050 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2050 New covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,050 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన కూలిపి మొత్తం కేసులు 19,82,308కు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 13,531 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,949 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,458 మంది కోలుకున్నారు.చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మృతి చెందారు. అనంతపురం, విశాఖ, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరేసి చొప్పున మృతి చెందారు.

2050 New covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News