- Advertisement -
449 కరోనా కేసులు..ఇద్దరి మృతి
హైదరాబాద్ః రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 79,231 మంది నమూనాలను పరీక్షించగా 449 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,49,406కి చేరింది. తాజాగా మహమ్మారికి ఇద్దరు బలి కాగా మొత్తం మృతుల సంఖ్య 3,825కి పెరిగింది. వైరస్ బారి నుంచి మరో 623 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,406 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
- Advertisement -