Wednesday, May 15, 2024

మరో 24,129 మందికి వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

24129 people get Covid vaccinated in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 24,129 మందికి వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో 23,023 మంది మొదటి డోసు, 1106 మంది సెకండ్ డోసు వేసుకున్నట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు 2,15,376 హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా, 1,62,783 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 1,08,689 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా, 57,980 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. అంతేగాక 2,90,530 వృద్ధులు, 1,32,692 మంది 45 నుంచి 59 ఏళ్ల మధ్యగల దీర్ఘకాలిక వయస్కులు టీకా తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో 9,68,050 మంది టీకా పొందినట్లు వైద్యశాఖ వెల్లడించింది.

24129 people get Covid vaccinated in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News