Thursday, May 2, 2024

ఎపిలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

248 new covid cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 28,509 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 248 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక కరోనా కారణంగా 24గంటల సమయంలో ఎటువంటి మరణం సంభవించలేదు. ఈక్రమంలో ఒక్కరోజు వ్యవధిలో 253 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,03,44,770 కు చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,446 కు పెరగగా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 20,55,856 కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,158 గా ఉంటే.. మృతుల సంఖ్య 14,432 కు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News