Friday, May 3, 2024

దేశంలో భారీగా తగ్గిన కేసులు..

- Advertisement -
- Advertisement -

28591 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 28,591 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా బారిన పడి మరో 338మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఒక కేరళలోనే కొత్తగా 20,487 పాజిటీవ్ కేసులు బయట పడగా,181మంది బాధితులు మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3.60 కోట్లకు చేరింది.ఇక, కరోనాతో దేశంలో ఇప్పటివరకు 4,42,655 మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 34,849మంది బాధితులు కోలుకోగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.33కోట్ల మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3.84 లక్షల కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 73.82 కోట్లకు పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

28591 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News