- Advertisement -
జగ్గయ్యపేట: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్లలోని వేములవాడ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని తిరిగి వెళుతుండగా, జగ్గయ్యపేట మండలంలో గరికపాడు ఫ్లైఓవర్పై కారు అదుపుతప్పి ఆగివున్న లారీని ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి గురైన బాధితులు ఖమ్మం జిల్లా మధిరలోని ఆత్కూరు గ్రామానికి చెందినవారిగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
3 died after Road accident at Jaggayyapeta
- Advertisement -