- Advertisement -
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12 గంటలకు భూమిపూజ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవన్ పక్కనే కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. లోక్ సభలో 888మంది, రాజ్యసభలో 384మంది కూర్చునెలా నిర్మాణం జరగనుంది. ఇక, అండర్ గ్రౌండ్ ఫ్లోర్ లో 20 మంత్రుల కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. కొత్త భవనాన్ని నాలుగు అంతస్తుల్లో రూ.971 కోట్లతో నిర్మించనున్నారు. ఈ నూతన పార్లమెంట్ భవన నిర్మాణం 2022 చివరిలోగా పూర్తికానుంది.
PM Modi to inaugurate New Parliament building on Dec 10
- Advertisement -