- Advertisement -
నల్లగొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం మిర్యాలగూడ చింతపల్లి హైవేపై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు మల్లికార్జున్(40), నాగేశ్వరరావు(44), జయరావ్(42)లుగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
3 died in Road Accident in Nalgonda
- Advertisement -