Saturday, May 4, 2024

నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

నారాయణపేట: జిల్లా కోస్గి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని గుండుమల్ గ్రామ శివారులో అతివేగంతో దూసుకొచ్చిన ద్విచక్రవాహనం, నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  మృతి చెందిన వారిలో ఇద్దరు బలభద్రాయ పల్లి గ్రామానికి చెందినవారు కాగా, మరొకరు గుండుమాల్ గ్రామానికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

3 Killed in Road Accident in Kosgi in Narayanpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News