Thursday, May 2, 2024

ఎపిలో 381 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

381 new covid cases reported in AP

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో 38,896 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 381 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటలలో కరోనా ఒక్కరు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,365 కు చేరింది. గత 24 గంటల్లో 414 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 20,46,127 మంది డిశ్చార్జ్ అయ్యారు.ఏపీలో ప్రస్తుతం 4743 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,65,235 కు చేరింది. ఎపిలో ఇప్పటి వరకు 2,94,04,281 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News