Wednesday, May 15, 2024

తెలంగాణలో కొత్తగా 3,821 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

3821 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు మూడు వేలకుపైనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,821 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 23 మంది కోవిడ్-19 బారిన పడి మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,169కి చేరింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 5,60,141కి పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 4,298 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రికవరీల సంఖ్య 5,18,266కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 38,706 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24గంటల్లో 81,203 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. కొత్తగా రికార్డయిన కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో 537, ఖమ్మం జిల్లాలో 245, రంగారెడ్డి జిల్లాలో 226, మేడ్చల్ జిల్లాలో 215, సూర్యాపేట జిల్లాలో 214 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

 

3821 new covid-19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News