Monday, May 6, 2024

భారత్‌లో 80 వేలు దాటిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

Coronavirus

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,967 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 100 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 51,401 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 27,920 నయమై కోలుకున్నారు. ఇండియాలో కరోనా మహమ్మారితో 2,649 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 81,970కు చేరింది. అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు మూడు లక్షలు దాటాయి. ఇప్పటివరకు ప్రపంచంలో 45లక్షల మంది కోవిడ్-19 బారిన పడ్డారు. 17లక్షలకు పైగా కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 25లక్షల యాక్టివ్ కేసులున్నాయి. అమెరికాలోనే అత్యధికంగా 14.6లక్షల మందికి కరోనా సోకింది. ఇప్పటిదాకా అమెరికాలో 87వేల మంది ప్రాణాలు విడిచారు. 2 లక్షలకు పైగా కరోనా కేసులు స్పెయిన్, రష్యా, బ్రిటన్, ఇటలీ, బ్రెజిల్ దేశాల్లోనే ఉన్నాయి.

3967 New Covid 19 cases and 100 deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News