- Advertisement -
హైదరాబాద్: ముక్కోటి వృక్షార్చనలో నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంపి సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24న టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఒకే రోజు తెలంగాణ వ్యాప్తంగా ముక్కోటి వృక్షార్ఛనలో మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమము చేపట్టనున్నారు. ముక్కోటి వృక్షార్చన బ్రోచర్ను ఎంపి సంతోష్ కుమార్ ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ఒకే రోజూ ఒక గంటలో మూడు కోట్ల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. బ్రోచర్ ఆవిష్కరణలో పలువురు మంత్రులు, ఎంఎల్ఎలు, టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
- Advertisement -