Sunday, April 28, 2024

రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

4 dead in road accident in chittoor district

అమరావతి: చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన ఓ కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురుగా వచ్చి బైక్ ను ఢీకొని లారీ కిందకు కారు దూసుకెళ్లింది. కర్నాటక నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంలో కారులోని ఓ మహిళ ఇద్దరు వ్యక్తులు, బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.

4 dead in road accident in chittoor district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News