- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 35లక్షలు దాటాయి. గత 24గంటల్లో 78,761 కొత్త కోవిడ్-19 కేసులు, 948 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 35,42,734కి చేరుకున్నాయి. దేశంలో ప్రస్తుతం 7,65,302 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 27,13,934 మంది బాధితులు కోలుకుని నయమైయ్యారు. ఇండియాలో 63,498 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిన్న పరీక్షించిన 10,55,027 నమూనాలతో సహా ఆగస్టు 29 వరకు పరీక్షించిన మొత్తం టెస్టుల సంఖ్య 4,14,61,636 చేరిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.
India COVID 19 cases tally crosses 35 lakh mark
- Advertisement -