Thursday, May 2, 2024

రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

493 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: తెలంగాణలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 493 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 157 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.04కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,684 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2.99లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అందులో హోంఐసోలేషన్ లో 1,616 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 138, మేడ్చల్ 42, రంగారెడ్డి 35 మందికి కరోనా సోకింది. గత వారం రోజులుగా హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతన్నాయి. నిన్న 56,464 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News