Wednesday, May 15, 2024

దేశంలో కొత్తగా 53,476 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 53476 new Covid-19 cases

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రికార్డుస్థాయిలో పెరుగుతన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 53,476 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 26,490 రికవరీలు, 251 మరణాలు సంభవించాయి. దేశంలో ప్రస్తుతం 3,95,192 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం కేసులు కరోనా కేసుల సంఖ్య 1,17,87,534కి పెరిగింది. దేశవ్యాప్తంగా 1,12,31,650 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇండియాలో కరోనా మరణాల సంఖ్య 1,60,692కి చేరింది. భారత్ లో మొత్తం 5,31,45,709 కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  తెలిపింది. నిన్న పరీక్షించిన 10,65,021 నమూనాలతో సహా మార్చి 24 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 23,75,03,882కి చేరిందని ఐసిఎంఆర్ ప్రటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News