Thursday, May 2, 2024

7 ట్రక్కులకు నిప్పుపెట్టడంతో ఐదుగురు సజీవదహనం…

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: గుర్తు తెలియని దుండగులు ఏడు ట్రక్కులను తగలబెట్టడంతో ఐదుగురు సజీవ దహనమైన సంఘటన అసోం రాష్ట్రం హసావో జిల్లా దియుంగ్బ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హసావో జిల్లాలో ఏడు ట్రక్కులలో బొగ్గు, ఇతర సామాగ్రిని సిమెంటు పరిశ్రమలకు తీసుకెళ్తుండగా ఐదుగురు వ్యక్తులు కాల్పులు జరిపారు. అనంతరం ట్రక్కులకు నిప్పంటించి ఘటనా స్థలం నుంచి దుండగులు పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌పి జయంత్ సింగ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రక్కులలో ఉన్న మృతదేహాలను బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.  డిఎన్‌ఎల్‌ఎ అనే మిలిటెంట్ సంస్థ ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని ఎస్‌పి అనుమానం వ్యక్తం చేశాడు. కర్బీ అన్ గ్లాంగ్ జిల్లాలో డిఎన్‌ఎల్‌ఎ తీవ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News