Thursday, May 2, 2024

18 లక్షలు దాటిన భారత్ కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

52 972 Covid 19 cases and 771 deaths in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభిస్తోంది.  పాజిటివ్ కేసులు 18లక్షలు దాటాయి. దేశంలో గత 24 గంటల్లో 52,972 కొత్త పాజిటివ్ కేసులు, 771 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 18,03,696కు పెరిగింది. వీటిలో 5,79,357 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు దేశంలో 1,186,203 నయమై కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 38,135 మంది బాధితులు కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఆగస్టు 2వతేదీ వరకు ఇండియాలో మొత్తం 2,02,02,858 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా… గడిచిన 24గంటల్లో 3,81,027 మందికి కోవిడ్ టెస్టులు చేసినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎమ్ఆర్) పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News