Friday, May 3, 2024

దేశంలో 26లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

 57982 Covid 19 cases and 941 deaths reported in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో గత 24గంటల్లో 57,982 కొత్త కోవిడ్-19 కేసులు,941 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26,47,664 కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 6,76,900 యాక్టివ్ కేసులుండగా.. 19,19,843 మంది కోవిడ్ బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాలు 50,921కి చేరాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.  కాగా దేశంలో ఆగస్టు 16 వరకు 3,00,41,400మంది నమూనాలను పరీక్షించగా… 24గంటల్లో 7,31,697 మంది బాధితులకు టెస్టులు చేసినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.

57982 Covid 19 cases and 941 deaths reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News