- Advertisement -
నడియార్: గుజరాత్లోని నడియార్ జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నడియాడ్ పట్టణంలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. అహ్మదాబాద్-వడోదర 8వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి వేగంగా ప్రయాణిస్తున్న కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటచేసుంది. స్థానికులు సమాచారంతో ఖేడా పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది మూడు అంబులెన్సులతో ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
5 killed 4 injured in a road accident on Ahmedabad
- Advertisement -