Sunday, May 19, 2024

ఘోర ప్రమాదం…పెళ్లికి వెళుతూ ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

beed accident

మంజార్ సంబా:   మహారాష్ట్రలోని  బీడ్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మంజార్ సంబా, పటోడా హైవేపై రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఉదయం 5.30 గంటల సమమంలో కారు, మరో వాహనం ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం తీవ్రస్థాయిలో జరిగినట్టు తెలుస్తుంది. ప్రమాద ధాటికి కారు మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిసరాలను పరిశీలించారు. సమాచారం అందుకున్న సహాయక చర్యలు చేపట్టారు.  ప్రమాదంలో చనిపోయిన ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

 వారంతా ఓ వివాహ వేడుకకు వెళ్తున్న సందర్భంలో వారిని మృత్యువు కబలించినట్టు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కారులో పూణెలో జరుగుతున్న పెళ్లికి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు రెండు వాహనాలను క్రేన్‌ సాయంతో వేరు చేసి, తరలించినట్టు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News