Saturday, July 27, 2024

భారతీయ స్సైస్‌మిక్స్ ఉత్పత్తులపై నేపాల్ నిషేధం

- Advertisement -
- Advertisement -

సింగపూర్, హాంకాంగ్ తరువాత నేపాల్ భారతీయ బ్రాండ్లు తయారు చేసిన కొన్ని రకాల స్పైస్‌మిక్స్ ఉత్పత్తుల అమ్మకాన్ని, దిగుమతిని నిషేధించింది. ఆ ఉత్పత్తుల నాణ్యతపై అనుమానాలే ఇందుకు కారణం. ఎథిలీన్ ఆక్సైడ్ (ఇటిఒ) కల్తీ అయిందనే అనుమానంతో ఎండిహెచ్, ఎవరెస్ట్ స్పైస్‌మిక్స్ ఉత్పత్తులు నాలుగింటిని నేపాల్ నిషేధించినట్లు ఖాట్మండులోని ఆహార టెక్నాలజీ, నాణ్యత నియంత్రణ విభాగం తెలియజేసింది. నేపాల్‌లో ఈ నిషేధిత ఉత్పత్తుల జాబితాలో ఎండిహెచ్ మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మిక్స్‌డ్ మసాలా పౌడర్, మిక్స్‌డ్ మసాలా కర్నీ పౌడర్, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా ఉన్నాయి. సింగపూర్, హాంకాంగ్ క్రితం నెల వాటిని నిషేధించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News