Thursday, May 2, 2024

మరోసారి 6 వేలకు దిగొచ్చిన కరోనా కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -
6561 new covid cases reported in india
2 శాతం లోపునకు క్రియాశీల రేటు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు మరోసారి 6 వేలకు దిగొచ్చాయి. బుధవారం 8 లక్షల మందిని పరీక్షించగా, 6561 మందికి వైరస్ సోకినట్టు తేలింది. కొత్త కేసులు మూడు నెలల కనిష్ఠానికి తగ్గిపోయాయి. పాజిటివిటీ రేటు ఒకశాతం దిగువకు చేరింది. మరణాలు కూడా భారీగా తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 142 మరణాలు సంభవించగా… ముందురోజు ఆ సంఖ్య 223గా ఉంది. ఇప్పటివరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకగా, 5.14 లక్షల మంది మృతి చెందారు. బుధవారం 14,947 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. బుధవారం వరకు రికవరీలు 4.23 కోట్లు దాటాయి. మొత్తం కేసుల్లో 98.62 శాతం మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. క్రియాశీల కేసులు 77 వేలకు దిగజారాయి. క్రియాశీల రేటు 2 శాతం దిగువకు చేరి , 0.18 శాతంగా నమోదైంది. ఇక నిన్న 21.8 లక్షల మంది టీకా తీసుకోగా, ఇప్పటివరకు 178 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News