- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 73,272 కొత్త కోవిడ్-19 కేసులు, 926 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 69,79,424కి చేరింది. వీటిలో 8,83,185 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు 59,88,823 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 1,07,416 మంది మరణించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపింది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 8,57,98,698 కరోనా పరీక్షలు నిర్వహించగా.. శుక్రవారం ఒక్కరోజులోనే 11,64,018 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసిఎంఆర్ (భారతీయ వైద్య పరిశోధన మండలి) ప్రకటించింది.
73272 new covid 19 cases 926 deaths in india
- Advertisement -