వైరస్ దాడిలో మరో 56 మంది మరణం
జిహెచ్ఎంసిలో 1508, జిల్లాల్లో 6553 మందికి పాజిటివ్
4,19,966 కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
చిత్రనటుడు అల్లు అర్జున్కు పాజిటివ్
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 8061 కేసులు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్ఎంసి పరిధిలో 1508 మంది ఉండగా ఆదిలాబాద్లో 125, భద్రాద్రి 82, జగిత్యాల 252, జనగామ 88, భూపాలపల్లి 68, గద్వాల 82, కామారెడ్డి 202, కరీంనగర్ 275, ఖమ్మం 277, ఆసిఫాబాద్ 79, మహబూబ్నగర్ 328 , మహబూబాబాద్ 97, మంచిర్యాల 171, మెదక్ 127, మేడ్చల్ మల్కాజ్గిరి 673, ములుగు 47, నాగర్కర్నూల్ 188, నల్గొండ 311, నారాయణపేట్ 40, నిజామాబాద్ 291, పెద్దపల్లి 145, సిరిసిల్లా 142, రంగారెడ్డి 514, సంగారెడ్డి 373, సిద్ధిపేట్ 253, సూర్యాపేట్ 185, వికారాబాద్ 276, వనపర్తి 146, వరంగల్ రూరల్ 191, వరంగల్ అర్బన్ లో 203 యాదాద్రిలో మరో 213 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
చిత్రనటుడు అల్లు అర్జున్కు పాజిటివ్..
చిత్రనటుడు అల్లు అర్జున్కు పాజిటివ్ తేలింది. గత రెండు రోజుల నుంచి స్వల్పపాటి లక్షణాలు ఉండటంతో టెస్టు చేపించుకోగా వైరస్ నిర్ధారణ అయినట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో గత వారం రోజుల నుంచి తనను కలసిన వారంతా టెస్టులు చేపించుకోవాలని ఆయన కోరారు.
మరో 1,08,888 మందికి వ్యాక్సిన్
రాష్ట్రంలో కొత్తగా మరో 1,08,888 మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో 89,650 మంది మొదటి డోసు, 19,238 మంది సెకండ్ డోసు వేసుకున్నట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు 2,42,455 హెల్త్కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా 1,80,059 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 2,38,232 మంది ఫ్రంట్లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా 79,852 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. 45 ఏళ్లు పై బడిన వారిలో 33,67,904 మంది మొదటి, 54,9898 మంది రెండో డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 43,98,489 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
8061 Corona positive cases in telangana