Sunday, April 28, 2024

దేశంలో మరో 89,129 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

89129 New Covid-19 Cases Reported in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా ఉధృతి రోజురోజుకు వేగంగా పెరుగుతుంది. గడిచిన 24గంటల్లో 89,129 మందికి కరోనా కరోనా సోకింది. అదే సమయంలో‌ 44,202 మంది కోలుకోగా, 714 మందిని కరోనా కబలించింది. దీంతో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1,23,92,260కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,64,110మంది మరణించారు. ఇండియాలో  1,15,69,241 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో ప్రస్తుతం 6,58,909 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 7,30,54,295 మందికి కోవిడ్ టీకాలు వేసినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. కాగా, భారత్ లో శుక్రవారం వరకు మొత్తం 24,69,59,192 కరోనా టెస్టులు చేసినట్టు ఐసిఎంఆర్ వెల్లడించింది. నిన్న 10,46,605 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News