- Advertisement -
హైదరాబాద్: కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 60 డివిజన్లలో ఇప్పటి వరకూ 34 డివిజన్లలో విజయం సాధించి టిఆర్ఎస్ సత్తా చాటింది. బిజెపి 12, ఎంఐఎం 5, ఇతరులు 8 డివిజన్లలో గెలుపొందగా.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఇంకా ఖాతా కూడా తెరవేలేదు. దీంతో కరీంనగర్ పీఠాన్ని కూడా టిఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఇక, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలో టిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది.
TRS Clean Sweep in Karimnagar Corporation Polls
- Advertisement -