Monday, May 6, 2024

చేపల వేట…. ఇద్దరు అన్నదమ్ములు బలి

- Advertisement -
- Advertisement -

fish hunting

 

మేడ్చల్: చేపల వేట ఇద్దరు అన్నదమ్ములను బలి తీసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా తూముకుంట ప్రాంతం రాంరెడ్డి కుంటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… విశాఖపట్నానికి చెందిన వెంకట రమణ (14), దుర్గాప్రసాద్ (10) తల్లిదండ్రులు జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఇద్దరు అన్నదమ్ములు రాంరెడ్డి కుంటలో చేపలు పడుతుండగా మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీశారు. దీంతో తూముకుంటలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇద్దరు కుమారులు చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News