Saturday, April 27, 2024

కరోనా కట్టడిలో కష్టపడి పని చేస్తున్నారు: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Lockdown

 

మహబూబ్‌నగర్: కరోనా కట్టడిలో జిల్లా అధికారులు కష్టపడి పని చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా వైరస్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన నెల రోజుల నుంచి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు.

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఎంపిలు, ఎంఎల్‌ఎలు, జడ్‌పి చైర్‌పర్సన్, కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో 11 కేసులు నమోదైన విషయం తెలిసిందే. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1122కు చేరుకోగా 29 మంది మృత్యువాతపడ్డారు. భారత దేశంలో ఇప్పటి కరోనా వైరస్ 56,563 మందికి సోకగా 1895 మంది చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News