ఢిల్లీ: ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపి… స్థానికులకు కరోనాతో మృతి చెందాడని నమ్మించడానికి ప్రయత్నించింది. పోలీసులు రంగప్రవేశం చేసి అంత్యక్రియలకు వరకు తీసుకెళ్లిన మృతదేహానికి శవ పరీక్ష చేయగా ఊపిరాడక చనిపోయాడని తేలింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శరత్దాస్ (46), అనిత(30) అనే దంపతులు ఢిల్లీలోని అశోక్విహార్లో జీవితం గడుపుతున్నారు. గత శనివారం తెల్లవారుజామున నిద్ర నుంచి భర్త లేవకపోవడంతో కరోనా వైరస్తో మృతి చెందాడని స్థానికులకు భార్య తెలిపింది. స్థానికులలో కొందరికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు తీసుకెళ్తున్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ చేయాలని ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్షలో శరత్ ఊపిరాడక మృతి చెందాడని తేలింది. కానీ తన భర్త మాత్రం కరోనా వైరస్తో చనిపోయాడని పోలీసుల ఎదుటు భార్య వాదిస్తోంది. కరోనా రిపోర్ట్లు ఇవ్వాలని పోలీసులు ఆమెను అడగడంతో నిజం ఒప్పుకుంది. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేశానని ఆమె వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రియుడు, ప్రియురాలును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.