- Advertisement -
తిరువనంతపురం: మలయాళ దర్శకుడు జిబిత్ జార్జ్ (30) కన్నుమూశాడు. కొచ్చిన్ లో జార్జ్ కు గుండెలో నొప్పి రావడంతో స్థానిక ఆస్పత్రి తరలించారు. హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతి చిన్న వయస్సులో జార్జ్ చనిపోవడంతో మలయాళ నటులు, దర్శకుడు, నిర్మాతలు మంచి దర్శకుడిని కోల్పోయామని సంతాపం తెలిపారు. కేరళలో మార్చ్ 11 నుంచి లాక్డౌన్ విధించారు. లాక్ డౌన్ విధించే మూడు రోజుల ముందు తాను దర్శకత్వం వహించిన ‘కొజిప్పార్‘ సినిమాను విడుదల చేశారు. లాక్ డౌన్ పూర్తయ్యాక సినిమాను విడుదల చేయాలని నిర్మాత దర్శకులు అనుకున్నారు. జార్జ్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బాలీవుడ్లో ఇద్దరు నటులు మరణించిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం మలయాళ నటుడు కారు ప్రమాదంలో చనిపోయాడు.
- Advertisement -