Monday, May 20, 2024

ఎపిలో కొత్తగా 57 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Coronavirus

అమరావతి: ఎపిలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,739 శాంపిళ్లను పరీక్షించగా మరో 57 మందికి కోవిడ్-19 సోకినట్లు ఎపి వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. దీంతో ఎపిలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,339కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 691 యాక్టివ్ కేసులుండగా… గత 24గంటల్లో కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. చిత్తూరులో ఒకరు, కర్నూలులో ఒకరు కరోనాతో చనిపోయారు. ఎపిలో కోవిడ్ మృతుల సంఖ్య 52కి చేరింది. ఇప్పటివరకు ఈ వైరస్ మహమ్మారితో కోలుకుని 1,596 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పరీక్షలు చేస్తున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News