పాట్నా: ట్రక్కు – బస్సు ఢీకొనడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది వలస కూలీలు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన బీహార్ భాగల్పూర్లోని నౌగచ్చియా వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వలస కార్మికులు ట్రక్కులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Bihar: At least 9 labourers dead & several injured after a truck & a bus collided in Naugachhia, Bhagalpur. The truck in which the labourers were travelling, fell off the road following the collision. Rescue operation underway. pic.twitter.com/rGVxw6xQVh
— ANI (@ANI) May 19, 2020