Saturday, May 25, 2024

మోడీ చేతకాని దద్దమ్మ…భార్యనే ఏలుకోలేదు: అద్దంకి దయాకర్

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: ప్రధాని మోడీ చేతగాని దద్దమ్మ అని, అధానీ, అంబానీలకు దేశాన్ని దోచిపెడుతున్నాడని టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఆదిలాబాద్ లో  ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోడీని మాటలతో ఉతికేశాడు.

ప్రధాని మోడీ ‘ఏక్ నిరంజన్’ అని, భార్యను కూడా ఏలుకోలేనోడు, దేశాన్ని ఏమి ఏలుతాడో ఆలోచించి ఓటేయాలన్నారు. మోడీ ముస్లింలపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని, ఆ చేతగాని దద్దమ్మ అమిత్ షా అనే లపూట్ గాడిని పక్కన పెట్టుకుని దేశాన్ని దోచుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని అద్దంకి దయాకర్ వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News