Thursday, May 9, 2024

ఎపిలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1433 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 68,041 సాంపిల్స్ పరీక్షించగా 1,433 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈక్రమంలో మరో 15 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1,815 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,97,102కు పెరగగా రికవరీ కేసులు 19,67,472కు చేరాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారినపడి 13,686 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,944 యాక్టివ్ కేసులు ఉన్నాయని, కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 2,58,35,650 గా ఉందని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News