Tuesday, April 30, 2024

పిడుగుపాటుకు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లో నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Four killed in lightning strike in Madhya Pradesh, Chhattisgarh

షాహ్దల్/కోర్బ: మధ్యప్రదేశ్‌లోని షాహ్దల్ జిల్లాలో పిడుగులు పడి ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. జైత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు గ్రామాల్లో పడిన పిడుగుల వల్ల వీరు మృతి చెందారు. బోడతోల గ్రామంలో పడిన పిడుగు వల్ల 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. భూష గ్రామంలో పడిన పిడుగుల వల్ల 22 ఏళ్ల యువకుడు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం ఈ దుర్ఘటనలు జరిగాయి. చత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో పిడుగులు పడి ఇద్దరు మృతి చెందారు. మంగళవారం సాయంత్రం ఘుద్దేవా గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టి తిరిగి వస్తున్న రామ్‌సింగ్(26), బూసాఖు(14) అనే వ్యక్తులు పిడుగులు పడి మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News