చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల శివారులోని రిలయన్స్ బంక్ సమీపంలో జాతీయ రహదారి NH 65పై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగివున్న లారీని వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు వెనుకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను రాజమండ్రి సమీపంలోని కొత్తపల్లికి చెందినవారిగా గుర్తించారు. మృతులను గీత, లక్ష్మీ, శ్రీనివాస్, లక్ష్మీ చంద్రగా గుర్తించారు. కొత్తపల్లి నుంచి హైదరాబాద్కు కారులో వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారు. కారులో ఉన్న ముగ్గురు పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ సర్కార్ ఆస్పత్రికి తరలించారు.
Three Died in Road Accident At Nalgonda