Tuesday, April 30, 2024

ఇండియా కరోనా మరణాలు @6,075

- Advertisement -
- Advertisement -

9304 new covid 19 cases and 260 deaths in india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కుప్పలు తెప్పలుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 9,304 కొత్త కోవిడ్-19 కేసులు, 260 మరణాలు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇన్ని కరోనా కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో భారత్ లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులు 2,16,919కు పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,06,737మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. 1,04,107 నయమై డిశ్చార్జ్  అయ్యారు.

ఇండియాలో కరోనా మహమ్మారి 6,075 మందిని కబలించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇటు తెలంగాణలో కూడా కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసులు మూడు వేలు దాటాయి. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు 74,860 చేరగా… 2,587మంది చనిపోయారు. తమిళనాడులో 25,872మందికి కరోనా సోకింది. 208మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు సంఖ్య 23,645 చేరుకోగా… 606 మరణాలు నమోదయ్యాయి. గుజరాత్ లో 18,100 కరోనా బారిన పడగా… 1,122 మంది కరోనా వైరస్ తో మృతి చెందారు.

 

9304 new covid 19 cases and 260 deaths in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News