Monday, May 6, 2024

భార్యను బెంగళూరులో చంపి… అత్తను కోల్‌కతాలో హత్య చేసి… ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Man kills wife-mother in law at bengaluru-kolkata

కోల్‌కతా: విడాకుల విషయంలో భార్యను బెంగళూరులో హత్య చేసిన తరువాత  అత్తను కోల్‌కతాలో చంపి అనంతరం అల్లుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమిత్ అగర్వాల్ తన భార్య శిల్పితో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో అమిత్ విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. విడాకుల విషయంలో భార్య కుటుంబ సభ్యులు, అమిత్ మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. బెంగళూరు తన ప్లాట్‌లో భార్యను చంపి అనంతరం విమానంలో కోల్‌కతాలోని అత్తగారింటికి చేరుకున్నాడు. అత్తగారింట్లో మామ, అత్తతో ఘర్షణకు దిగాడు. ముగ్గురు మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో గన్ తీసి లలితా ధాంధానియా కాల్చాడు. వెంటనే మామా సుభాష్ ధాంధానియా అక్కడి నుంచి తప్పించుకొని ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి అమిత్ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అమిత్ దగ్గర ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలపై ఇరు రాష్ట్రాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News