Monday, April 29, 2024

తల్లి ప్రియుడితో ఇద్దరు కూతుళ్లు కలిసి….

- Advertisement -
- Advertisement -

Daughters murder women with mother live in partner

అహ్మదాబాద్: తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తితో ఇద్దరు కూతుళ్లు కలిసి తల్లిని చంపిన సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రాంతంలో అమరైవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రంజన్ సోలంకి అనే ఆమె భర్తతో విడాకులు తీసుకొని గిరిష్ పార్మర్‌తో సహజీవనం చేస్తోంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. రంజన్‌కు తన ప్రియుడు గిరిష్‌తో పాటు ఇద్దరు కూతుళ్ల మధ్య డబ్బుల విషయంలో గొడవ జరుగుతోంది. వాళ్లు ముగ్గురు చెప్పినట్టు రంజన్ వినడం లేదని చంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో పని వాళ్లు లేనప్పుడు రంజన్ మధ్యాహ్నం సమయంలో నిద్రపోతుంది. వెంటనే గిరిష్‌కు ఆమె ఇద్దరు కూతుళ్లు పోన్ చేసి రమ్మని కబురు పంపారు.  మధ్యాహ్నం ఆమె గాఢ నిద్రలో ఉన్నప్పుడు ముగ్గురు కలిసి దుప్పెట సహాయంతో రంజన్ ను ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం తన తల్లి చనిపోయిందని పోలీసులకు పెద్ద కూతురు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బెడ్‌పై ఉన్న ఆమె మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం రంజన్ కూతుళ్లపై పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించడంతో వాళ్లు నిజాలు ఒప్పుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురికి కరోనా టెస్టులు చేసిన అనంతరం జైలుకు తరలిస్తామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News