- Advertisement -
అధికారులను తాడుతో కట్టేసిన ముస్లాపూర్ వాసులు, పోలీసుల చొరవతో విముక్తి
అల్లాదుర్గం: విద్యుత్ బిల్లులు వసూళు చేసేందుకు వెళ్లిన ఆ శాఖ అధికారులను గ్రామస్తులు నిర్బంధించిన ఘటన మెదక్ జిల్లా, అల్లాదుర్గం మండలం, ముస్లాపూర్లో శనివారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉన్నతాధికారులు వచ్చేంతవరకు అధికారులను విడిచేది లేదంటూ గ్రామ చావిడిలో ఉన్న ఓ పిల్లర్కు అధికారులను తాడుతో కట్టి బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని అధికారులను విడిపించి విచారణ చేపట్టారు.
Villagers Detain Employees To Solve Power Problems
- Advertisement -