Wednesday, May 1, 2024

24 గంటల్లో 38,902 కరోనా కేసులు.. 543 మరణాలు

- Advertisement -
- Advertisement -

38902 cases and 543 deaths reported in India

 

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో అత్యధికంగా 38,902 కొత్త కోవిడ్-19 కేసులు, 543 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 10,77,618కి చేరింది. వీటిలో 3,73,379 యాక్టివ్ కేసులుండగా… 6,77,423 నయమై కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 26,816 మంది కరోనా బాధితులు మరణించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడిచిన 24గంటల్లో 3లక్షల 58,127 మందిరి కరోనా టెస్టులు చేసినట్టు ఐసిఎమ్‌ఆర్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అత్యధికంగా కేసులు అమెరికా, బ్రెజిల్, ఇండియా, సౌతాఫ్రికాలో నమోదవుతున్నాయి.

38902 cases and 543 deaths reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News